Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Andhra Pradesh దసరా నుంచి పేదలకు మూడు గ్యాస్ సిలండర్లు

దసరా నుంచి పేదలకు మూడు గ్యాస్ సిలండర్లు

by Satya
దసరా నుంచి పేదలకు మూడు గ్యాస్ సిలండర్లు

రాష్ట్రంలో దసరా నుంచి పేదలకు మూడు గ్యాస్ సిలండర్లు పథకం అందుబాటులోకి వస్తుందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పురపాలక కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ప్రభుత్వం ఏర్పడి 110 రోజుల్లోనే రాష్ట్రంలో యువతకు డీఎస్సీ తో పాటు ఇతర స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళలకు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రభుత్వాలు, నాయకులు మారినా ప్రజలకు మేలు చేసే విధంగానే ఉండాలన్నదే తమ నినాదమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.