Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home National మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస

మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస

by Rama
మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస

మళ్లీ మణిపూర్ భగ్గుమంటోంది. మరోసారి హింసాత్మక మంటల్లో కాలిపోతోంది. ఇక్కడ ఆందోళనకారులు ఆగ్రహంతో ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై దాడి చేశారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ఘటన సమయంలో సీఎం బీరేన్ సింగ్ ఆ ఇంట్లో లేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం తన కార్యాలయంలో ఉన్నారని, పూర్తిగా క్షేమంగా ఉన్నారని తెలిసింది. రాజధాని ఇంఫాల్‌లో మణిపూర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన తరుణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ముగ్గురి హత్య తర్వాత చెలరేగిన నిరసనల దృష్ట్యా ఆరు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అంతకుముందు, ఇంఫాల్‌లోని ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారులు దాడి చేశారు. ఆ తర్వాత నిరసన హింసాత్మకంగా మారింది. మణిపూర్ లో హింసపై అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ శాంతి భద్రతల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మణిపూర్‌లో మోహరించిన అన్ని భద్రతా బలగాలను పరిస్థితిని కంట్రోల్ చేయమని సూచించింది

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
  • సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
    సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
  • భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
    రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: