Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Latest News కాంగ్రెస్‌కు ఓటేస్తే భారాసకు వేసినట్లే

కాంగ్రెస్‌కు ఓటేస్తే భారాసకు వేసినట్లే

by Prakash
pm modi

తెలంగాణకు వచ్చినప్పుడల్లా ప్రజల్లో ఆశావాహ దృక్పథాన్ని చూస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ స్వార్థ పార్టీలని విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలన వల్ల ప్రజల సామర్థ్యాలు వెలుగులోకి రావటంలేదని విమర్శించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలని కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే బీఆర్ఎస్ కు వేసినట్లేనన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే నా లక్ష్యమని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారన్నారు. మాదిగల వర్గీకరణకు కొత్తగా కమిటీని ఏర్పాటు చేశామని మోదీ వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: