అధికారం ఉన్నా లేకున్నా మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికే అందుబాటులో ఉంటానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రం లో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ…కష్టపడి పనిచేసిందుకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే దాక ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేస్తానని తెలిపారు.అలాగే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు అధైర్యం చెందవద్దని ప్రజల తో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన సోషల్ మీడియా వారియర్స్ కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మానకొండూర్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే…
247
previous post





Total views : 79119