Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు..

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు..

by Rama
Drinking water

అనంతపురం జిల్లా.. రాయదుర్గం పట్టణంలోని కోతుగుట్ట ఏరియాలో గత 15 రోజులుగా తాగినీటి సమస్య నెలకొంది. దీంతో కాలనీ నివాసులు అనంతపురం ప్రధాన రహదారిపై అరగంట పాటు బైఠాయించి నిరసన తెలిపారు. స్పందించిన ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ రోడ్డుపై బైఠాయించిన మహిళలకు సమాధానం చెబుతూ తమ సమస్యను కార్యాలయంలో తెలియజేయాలి రోడ్డుపై బైఠాయించడం సరి కాదన్నారు. అనంతరం పురపాలక సంఘం కార్యాలయం ముట్టడించారు.
మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తమ సమస్యను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలపడంతో మహిళలు తమ నిరసనను విరమించుకున్నారు.‌

Advertisements

You may also like

Our Visitor

025718
Total views : 148091

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.