పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మేనిఫెస్టో ప్రెస్ మీట్ నిర్వహించిన యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasarao) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగేలా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తయారు చేశారని కొనియాడారు. 200 వందల రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసింది కూడా చంద్రబాబు నాయుడేనని 2019 ఎలక్షన్ కు ముందు పెన్షన్ 3000 చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ కు 3000 పెన్షన్ చేయడానికీ సంవత్సరానికి ₹250 చొప్పున ఐదు సంవత్సరాలు పట్టిందని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అలాగే 2024 ఎలక్షన్ మేనిఫెస్టో హామీలో కూడా 3000 పెన్షన్ దశలవారీగా 3500 చేస్తానని జగన్ అన్నారని అంటే రెండు సంవత్సరాలు రెండు వందల యాభై రూపాయలు చొప్పున అధికారంలోకి వస్తే ఇంకో ఐదు సంవత్సరాలు పడుతుంది జగన్ నీకు 3500 పెన్షన్ చేయడానికి అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే 3000 పెన్షన్ ను ఏప్రిల్ నెల నుంచి 3500 ఇస్తామని అన్నారు. వ్యవస్థలను కుటుంబ సభ్యులను గౌరవించని జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఏం గౌరవిస్తారని అన్నారు. జూన్ 4 తర్వాత జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు.…
- పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు గత వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు, నిధుల మళ్లింపు, అవినీతి జరిగాయని ఆరోపించారు.…
- అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు, బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల స్థలాలను తమ కుటుంబం నిరంతరం కాపాడుతూ వస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఈ స్థలాలు రద్దయ్యే…





Total views : 140805