Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Andhra Pradesh వైఎస్ కుటుంబంలో మరోసారి భగ్గుమన్న విబేధాలు

వైఎస్ కుటుంబంలో మరోసారి భగ్గుమన్న విబేధాలు

by Satya
వైఎస్ కుటుంబంలో మరోసారి భగ్గుమన్న విబేధాలు

వైఎస్సార్ కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్ జగన్ వర్సెస్ షర్మిల, విజయమ్మల మధ్య ఆస్తుల వార్ మొదలైంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సతీమణి వైఎస్ భారతి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. వైఎస్ జగన్ తరఫున వై సూర్యనారాయణ కంపెనీల యాక్ట్ 59 కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించి.. తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఎన్‌సీఎల్‌టీ ఈ పిటిషన్‌కు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తన సోదరిపై అప్యాయతతో షర్మిలకు మొదట్లో వాటాలు కేటాయించాలని భావించామన్నారు జగన్. అయితే ఇటీవల రాజకీయంగా ఆమె తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ ఆఫర్‌ను విరమించుకున్నట్లు పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ కంపెనీలో తనకు 51 శాతం వాటాలు ఉన్నాయని, తన సోదరి, తల్లి షేర్ల బదిలీని రద్దు చేయాలని NCPLT ని జగన్ అభ్యర్థించారు. వారిద్దరికి వాటాలు ఇవ్వదల్చుకోలేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.