Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Latest News వాయనాడ్ లో నామినేషన్ వేసిన ప్రియాంకగాంధీ

వాయనాడ్ లో నామినేషన్ వేసిన ప్రియాంకగాంధీ

by Satya
వాయనాడ్ లో నామినేషన్ వేసిన ప్రియాంకగాంధీ

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయానాడ్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు వయానాడ్ కల్ఫేటాలో మెగా ర్యాలీ నిర్వహించారు. ప్రియాంకా గాంధీ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్న ఖర్గే సహా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.
రాహుగాంధీ రాయ్ బరేలీ, వయానాడ్ లో రెండుచోట్ల లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందగా, ఆయన వయానాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. రాహుల్ రాజీనామాతో వయానాడ్ బరిలో ప్రియాంకా గాంధీ బరిలోకి దిగుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆమెకు ఇదే తొలిసారి. ప్రియాంక గాంధీకి యూడీఎఫ్ మద్దతునిస్తోంది. వయానాడ్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికకు నవంబర్ 13న పోలింగ్ జరుగుతుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014807
Total views : 81064

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.