Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతమొందించాల్సిందే – వంశీచంద్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతమొందించాల్సిందే – వంశీచంద్ రెడ్డి

by Rama
Vamshi chand reddy

రాష్ట్రాన్ని నిరుద్యోగ తెలంగాణగా మార్చిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఏఐసీసీ సెక్రటరీ, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 15.1 శాతం ఉందని, నిరుద్యోగుల పట్ల కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ లెక్కలే చెప్తున్నాయన్నారు. గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం అమలు చేసిన ప్రణాళికలను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలున్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న 3,607 మంది ఆత్మలకు శాంతి కలగాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతమొందించాల్సిందేనని తేల్చి చెప్పారు.

Advertisements

You may also like

Our Visitor

026211
Total views : 150047

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.