Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Devotional రాజన్న పుణ్య క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..!

రాజన్న పుణ్య క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..!

by
rajanna temple

కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ముగుస్తున్నడంతో తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ముందు భాగంలో కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తినీ, చాటుకున్నారు. తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో స్వామివారిని దర్శించు కునేందుకు ఐదు గంటలు పైగా సమయం పట్టింది. అలాగే తమ కోరిన కోరికలు నెరవేరాలని స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమోక్కు పూజలు చెల్లించుకున్నారు భక్తులు. అటు ప్రసాదం కౌంటర్స్, కళ్యాణకట్ట లో భక్తులతో నిండిపోయాయి…. వాయిస్ : వచ్చిన భక్తుల కోసం కనీస వసతులు ఏర్పాటు చేయలేదని భక్తులు అగ్రహo వ్యక్తం చేశారు. ఆలయ సిబ్బందికి తెలిసిన వారిని, లోపలికి అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల దేవుడు రాజన్న, కనీసం పేదలకు దర్శనం కాకుండ ఆలయ అధికారులు చేసారని మీడియాతో వాపోయారు….

Advertisements

You may also like

Our Visitor

026185
Total views : 150011

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.