Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana ధరణి- భూ సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష

ధరణి- భూ సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష

by Prakash
cm revanth reddy

రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించారు. ఈ మేరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ధరణి- భూ సమస్యలపై సీఎం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖల మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, సీఎస్‌ శాంతికుమారి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ పాల్గొన్నారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మంత్రులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ చట్టాల నిపుణులను సభ్యులుగా నియమించాలని సూచించారు. పోర్టల్‌కు సంబంధించిన వివరాలపై నవీన్‌ మిత్తల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. సమీక్ష సందర్భంగా సీఎంతోపాటు మంత్రులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో సమాచారం అందించాలని ఆదేశించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.

Advertisements

You may also like

Our Visitor

019514
Total views : 90901

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.