పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పల్నాటి వీరరాధనోత్సవాల్లో మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు కరువుకోరల్లో చిక్కుకుందని కానీ ప్రభుత్వం పల్నాడు ను కరువు మండలంగా ప్రకటించకపోవడం దారుణమని ఆయన బాధపడ్డారు. తక్షణమే పల్నాడు ప్రాంతాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్నిడిమాండ్ చేసారు. రైతుల రుణాలు రద్దు చేసి కొత్త రుణాలను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్నికోరారు. మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను, దౌర్జన్యాలను ప్రజలు అంతం చేయాలని రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ కి ప్రజలు బుద్ది చెప్పకపోతే భవిష్యత్ అంధకారంలోకి వెళుతుందని ఆయన ప్రజలను హెచ్చరించారు. మాచర్ల నియోజకర్గంలో బానిస సంకెళ్లు తెంచడానికి ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
ఓటుతో బానిస సంకెళ్లు తెంచుకో….
308
previous post






Total views : 90787