291
పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువగళం పాదయాత్ర టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపింది అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి నాయకులకు ధన్యవాదాలు అని, నరసరావుపేటలో టీడీపీ గెలుపు కోసం నాలుగున్నర ఏళ్లుగా పని చేస్తున్నాను అన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సి, ఎస్టీ, బీసీలు బ్రహ్మరథం పడతారు అని, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అన్నారు. యువగళం విజయంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు అని తెలియజేశారు.





Total views : 79269