Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra PradeshPrakasam ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఘోరం..

ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఘోరం..

by Rama
Car - Bike Accident

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిట్టమీదీపల్లె గ్రామ సరిహద్దులోని జాతీయ రహదారిపై బైక్ ను కారు ఢీ కొన్న సంఘటన లో తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు ఫణీంద్ర ఆరోగ్యం బాగాలేక పోతే మార్కాపురం ఆసుపత్రిలో చూపించుకోని తిరిగి కంభం కు పోతున్న క్రమంలో మిట్టమీద పల్లె గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన లో తండ్రి సొరకాయల బుజ్జి (35), కొడుకు ఫణీంద్ర (10) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు కంభం వాసులు గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణం కారు వేగంగా రావడమని తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: