Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra PradeshEast Godavari చనిపోయాడనుకున్న వ్యక్తి ఫోన్ చేశాడు..

చనిపోయాడనుకున్న వ్యక్తి ఫోన్ చేశాడు..

by Rama
Attacks on a Farmer

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఉదయం పొలం పనుల నిమిత్తం పొలంలోకి వెళ్లే సరికి మంట కనిపించడంతో వైర్లు దొంగలించేందుకు వచ్చారని వాళ్లపైకి వెళ్లడంతో అప్పటికే ఒక మగ శవాన్ని కాలుస్తున్న వారు వెంకటేశ్వరరావు ని కొట్టి ఆటోలో తీసుకుని పీడింగొయ్యి వద్ద పొలాల్లో వదిలి వెళ్లిపోయారు. అప్పటికే అక్కడ పూర్తిగా కాల్చి ఉన్న శవం పక్కన వెంకటేశ్వరరావు చెప్పులు, ఫోన్, బండి చూసిన బంధువులు వెంకటేశ్వరరావు శవం గా భావించి చనిపోయాడు అని భావించారు. అనంతరం కొద్ది గంటల సమయం తరువాత వెంకటేశ్వరరావు వాళ్ళ భార్యకు ఫోన్ చేసి నేను బ్రతికె వున్నానని చెప్పేసరికి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి నేరస్తులను పట్టుకుంటామని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

020367
Total views : 92791

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.