Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Latest News గుర్తింపు సంఘం పేరుతో ఉద్యోగాల కుంభకోణం…

గుర్తింపు సంఘం పేరుతో ఉద్యోగాల కుంభకోణం…

by Prakash
A media conference organized at the Godavarikhani Press Club premises

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో గుర్తింపు సంఘం నాయకులు ఉద్యోగాల పేరుతో కుంభకోణానికి పాల్పడుతున్నారని పాలకుర్తి జడ్పీటీసీ, బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి ఆరోపించారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్మిక నాయకులు పరిశ్రమకు సంబంధించిన కొందరు అధికారులతో కుమ్మక్కై లక్షల కోట్ల రూపాయలు అమాయకులు, రైతుల నుంచి వసూలు చేస్తూ గోల్ మాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎరువుల కర్మాగారం విషయంలో కూడా కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, అలా కాకుండా ఉన్నతాధికారులు దీనిపై సీరియస్‌గా తీసుకొని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్టీపీసీ పరిశ్రమ ఏర్పాటు సమయంలో భూములు కోల్పోయిన రైతులు, అర్హత కలిగిన యువకులను మోసం చేస్తూ డబ్బులు ఇచ్చిన వారికే తాత్కాలిక ఉద్యోగాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. నిర్వాసితులకు ఎన్టీపీసీ యాజమాన్యం తప్పనిసరిగా ఉపాధి కల్పించాల్సి ఉండగా కార్మిక నాయకులు కొందరు అధికారులతో కుమ్మక్కై నిర్వాసితుల నోట్లో మన్ను కొడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా పరిశ్రమ ఉన్నతాధికారులు స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014308
Total views : 79866

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.