Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Andhra PradeshChittoor టీడీపీ, జనసేన నేతల ప్రచార కార్యక్రమం..

టీడీపీ, జనసేన నేతల ప్రచార కార్యక్రమం..

by Rama
TDP-Janasena

లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా టీడీపీ, జనసేన (TDP, Janasena) నేతలు

కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా టీడీపీ, జనసేన నేతలు (TDP, Janasena) ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మునిరత్నం పాల్గొన్నారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మునిరత్నం, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొత్తపేటలో చంద్రబాబుకు ప్రతి ఎన్నికల్లో చంద్రబాబుకు భారీ మెజారిటీ వస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కొత్తపేటలోని 5 బూత్ లలో చంద్రబాబుకు మరింత మెజారిటీ వస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కుప్పం సమన్వయకర్త నరేష్, మరియు టీడీపీ నేతలు ముఖేష్, రాజ్ కుమార్, మరియు టీడీపీ, జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇది చదవండి: పసికందును కన్నతల్లి ఏం చేసిందంటే..?


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019595
Total views : 91190

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.