నెల్లూరు జిల్లా(Nellore District)లో దారుణం జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేని ఓ భార్య అతడ్ని దారుణంగా హతమార్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు(Sri Potti Sriramulu) నెల్లూరు జిల్లా(Nellore District) బండారు మాన్యం వద్ద అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తరచూ మద్యం సేవించి వేదింపులకు గురిచేస్తున్నాడని ఇంట్లో గొడవలు జరుగుతుండేవని ఇదే క్రమంలో భార్య పద్మ భర్త అయ్యప్పను రోకలితో కొట్టడంతో మృతి చెందినట్లు తెలుస్తుంది. పోలీసు(Police)లు మృతుని భార్యను అదుపులో తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.