Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు అమలు చేశారా?

నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు అమలు చేశారా?

by Prakash
Secunderabad

సికింద్రాబాద్ (Secunderabad) :

తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాద్ (Secunderabad) అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక్కడి నుంచి పద్మారావు గౌడ్ మన పార్టీ తరఫున పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి ఆలోచనలో పడ్డారని పేర్కొన్నారు. యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. బీజేపీని ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి ఏం చేశారని నిలదీశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు అమలు చేశారా? అని ప్రశ్నించారు.

ఇది చదవండి : బీజేపీ ఎమ్మెల్యే హరీష్ మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ..


కేసీఆర్‌ వెంట నడిచిన సైనికుడు పద్మారావు అని ప్రశంసించారు. పద్మారావును చూసి కిషన్ రెడ్డి భయపడుతున్నారంటే మన గెలుపు ఖరారైనట్లే అన్నారు. బీజేపీ తీరు ఎలా ఉందంటే… మోదీ జేబులో ఉండాలి, లేదంటే జైలులో ఉండాలి అన్నట్లుగా దేశంలో పరిస్థితి మారిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హైదరాబాద్‌లో క్లీన్ స్వీప్‌ చేసిందని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించింది బీఆర్‌ఎస్సే అన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్‌లను ఓడించింది బీఆర్ఎస్ వారే అన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కిషన్‌ రెడ్డిని ఓడించేది మన పద్మారావే అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
    నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. దుమ్ము, ధూళితో కప్పుకుపోయిన ఈ…
  • ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
    అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్‌లోని సెబాన్ రివర్‌లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు. హఠాత్తుగా…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు అమలు చేశారా?
Advertisements

You may also like

Our Visitor

019430
Total views : 90704

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.