లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు మరికొన్ని గంటల్లో గడువు ముగుస్తుందనగా కాంగ్రెస్ పార్టీ(Congress party) మూడు పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఖమ్మం(Khammam) నుంచి రామసహాయం రఘురామ్రెడ్డి(Raghuram Reddy), కరీంనగర్(Karimnagar) నుంచి వెలిచాల రాజేందర్రావు(Rajender Rao), హైదరాబాద్(Hyderabad) నుంచి సమీర్ వలీ ఉల్లా ఖాన్ పోటీ చేయనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) ప్రకటించారు. ఇప్పటికే ఈ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ నుంచి బీ-ఫామ్ అందుకుని రిటర్నింగ్ ఆఫీసర్కు సమర్పించడమే మిగిలింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఏఐసీసీ తెర దించింది. ఊహించినట్లుగానే ఖమ్మం స్థానానికి రఘురామ్రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్రావు పేర్లు ఖరారయ్యాయి. ఈ రెండు స్థానాల్లో సామాజిక సమీకరణాలకు ప్రత్యేకత ఉన్న పరిస్థితుల్లో ఏఐసీసీ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
ఇది చదవండి: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఈ ముగ్గురి పేర్లను ప్రకటించడంతో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లయింది. నామినేషన్ల గడువు గురువారంతో ముగుస్తున్నందున ఇక ప్రచారం మొదలుపెట్టడమే తరువాయి. ఇప్పటివరకు ఈ స్థానాల్లో అభ్యర్థులెవరో తెలియకపోవడంతో ప్రచారం లాంఛనంగా ప్రారంభం కాలేదు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరావు, మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లను దాఖలు చేసినా ఇప్పుడు లాంఛనంగా రఘురామ్రెడ్డి పేరును ఖరారు చేయడంతో వారు బరి నుంచి తప్పుకోవడం అనివార్యంగా మారింది. కరీంనగర్లో సైతం టికెట్ ఆశించిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కానీ అక్కడ రాజేందర్రావును ఏఐసీసీ ఫైనల్ చేయడంతో ప్రవీణ్ రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకోనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. దుమ్ము, ధూళితో కప్పుకుపోయిన ఈ…
- ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్లోని సెబాన్ రివర్లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు. హఠాత్తుగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి






Total views : 91174