Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Telangana నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నా అమిత్‌ షా..

నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నా అమిత్‌ షా..

by Satya
Amit Shah

తెలంగాణ(Telangana)లో లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనుంది బీజేపీ(BJP). ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట పట్టనున్నారు. తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణ పర్యటనకు రానున్నారు. నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు అమిత్‌ షా. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్‌ షా చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్ధిపేటకు వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2 గంటల తర్వాత తిరిగి భువనేశ్వర్‌ వెళ్లనున్నారు అమిత్‌ షా.

ఇది చదవండి: ఇంటర్ ఫలితాలలో “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం…

ఈ బహిరంగ సభకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి అభయ్ పాటిల్, మెదక్ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్ రావుతో పాటు పలువురు నేతలు హజరవుతారు. అమిత్‌ షా సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమిత్‌షా రాకతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని భావిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత… అమిత్ షా తొలిసారి తెలంగాణ పర్యటనకు రానుండటంతో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. సభా ప్రాంగణాన్ని భారీ కటౌట్లతో నింపనున్నారు. అలాగే పెద్ద ఎత్తున జనసమీకరణకు బీజేపీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • భారీ వర్షాల కారణంగా మధిర సభ రద్దు.
    రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు. వర్షాల కారణంగా సభను హైదరాబాద్‌కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం…
  • రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన.
    బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం నిన్న హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన..రంగారెడ్డి జిల్లాలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇవాళ హైదరాబాద్‌లోని వీబీఐటీలో నిర్వహించే ‘వికసిత్ భారత్ యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు.…
  • జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్‌ఐ షేక్‌ హమీద్ సస్పెండ్.
    జనగామ జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఒకే పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐ, ఎస్‌ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్ఐ షేక్‌ హమీద్‌లను సస్పెండ్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

036138
Total views : 181010

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.