Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Telangana నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నా అమిత్‌ షా..

నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నా అమిత్‌ షా..

by Satya
Amit Shah

తెలంగాణ(Telangana)లో లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనుంది బీజేపీ(BJP). ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట పట్టనున్నారు. తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణ పర్యటనకు రానున్నారు. నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు అమిత్‌ షా. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్‌ షా చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్ధిపేటకు వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2 గంటల తర్వాత తిరిగి భువనేశ్వర్‌ వెళ్లనున్నారు అమిత్‌ షా.

ఇది చదవండి: ఇంటర్ ఫలితాలలో “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం…

ఈ బహిరంగ సభకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి అభయ్ పాటిల్, మెదక్ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్ రావుతో పాటు పలువురు నేతలు హజరవుతారు. అమిత్‌ షా సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమిత్‌షా రాకతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని భావిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత… అమిత్ షా తొలిసారి తెలంగాణ పర్యటనకు రానుండటంతో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. సభా ప్రాంగణాన్ని భారీ కటౌట్లతో నింపనున్నారు. అలాగే పెద్ద ఎత్తున జనసమీకరణకు బీజేపీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
  • బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.
    హైదరాబాద్ బాలానగర్‌లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ ఈగల్ పోలీసులకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. నిందితులు పోలీసులపై కుక్కను వదలడంతో పాటు స్క్రూడ్రైవర్‌తో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో నిందితుడు పక్క భవనాలపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం…
  • మంచిర్యాల జిల్లాలో ముగిసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.
    మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు, భారీ ర్యాలీ నిర్వహించి తమ ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: