Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra PradeshKadapa జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం..

జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం..

by Rama
Bhupesh reddy

కడప జిల్లా… జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలంలో మాజీ మంత్రి జమ్మలమడుగు బిజెపి అభ్యర్థి మరియు కడప తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి (Bhupesh Reddy) ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం నెమల్లదిన్నె గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ….. ప్రస్తుతం రాజోలి జలాశయం ముంపు గ్రామమైన నెమల్లదిన్నె గ్రామంలో తాను, భూపేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే రాజోలి జలాశయ ముంపు వాసుల కష్టాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాజోలి జలాశయం నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఈ జలాశయం ప్రకటన రావడంతో ఇక్కడి ప్రజలకు తమ స్థలాలను అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయిందని దీంతో అవసరాలు ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజోలి ముప్పు గ్రామాలకు ఎకరా 24 లక్షలు ఇస్తామన్నారు. కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి నిద్రపోయాడని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకున్నాడని, అందుకే ఆయనను తాను జరోన గా అభివర్ణిస్తానని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని అన్నారు. కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పై వివేకానంద రెడ్డిని చంపడంలో ఆయన పాత్ర ఉందని సొంత చెల్లెలు ఆరోపిస్తున్నారని తెలిపారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అగ్రిగోల్డ్ బాధితులకు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబుతో మాట్లాడి న్యాయం చేస్తామని అగ్రిగోల్డ్ బాధితులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. టౌన్ బ్యాంక్ బాధితులకు కూడా న్యాయం చేస్తామన్నారు. తన వియ్యంకుడు కేశవరెడ్డి గురించి మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణం ఆయన ఆస్తులు ప్రభుత్వానికి అటాచ్ చేసి ప్రతి ఒక్కరికి అప్పు తీర్చడం జరుగుతుందని ఈ విషయంపై తాను చాలా కసరత్తులు చేశానని ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు.

  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
  • ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
    ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
Advertisements

You may also like

Our Visitor

039412
Total views : 196708

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: