Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Telangana తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం

తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం

by Satya
తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం

తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై 20 ఏళ్లు గడిచినా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గకపోగా, రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని చంద్రబాబు మరోసారి ఉద్ఘాటించారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తొలిసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు విచ్చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును టీడీపీ తెలంగాణ నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీని యుగపురుషుడు ఎన్టీఆర్ ఇదే గడ్డపై, ఇక్కడే ఎమ్మెల్యే కాలనీలో ప్రారంభించారని గుర్తుచేశారు. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేందుకు టీడీపీ పుట్టుకొచ్చిందని, ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు తెలిపారు. రెండు ప్రాంతాల ప్రయోజనాల కోసం ఆలోచించి పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పారు. తెలుగుజాతి ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటా, కలిసిమెలిసి ఉండాలనే నా చివరి రక్తపుబొట్టు వరకు ఆలోచిస్తానని చంద్రబాబు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • 15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.
    భారత క్రికెట్‌కు మరో అద్భుతమైన యువ సంచలనం దొరికింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 సీజన్‌ను తన పేలవమైన కాదు, పేలుడు బ్యాటింగ్‌తో ఏకంగా శాసించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు…
  • గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
    కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
  • కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
    నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. దుమ్ము, ధూళితో కప్పుకుపోయిన ఈ…
  • కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అలేఖ్యపై తీవ్ర ఆరోపణలు.
    కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య పై స్థానికంగా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలలో ఆమె పాలన పట్ల ఆవేదన ఉంది. గతంలో చెక్ పోస్టుల వద్ద వచ్చే ఆదాయం సగానికి తగ్గిపోయిందని, గత చైర్మన్‌ల ఆధీనంలో ఉన్న…
  • మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.
    రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చడం అనే ట్రెండు… ఇప్పుడు కామన్ అయిపోయింది….! ఎట్ ది సేమ్ టైం ఫాలోయర్స్ కూడా నాయకులను బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు…. దీంతో నేతలకు పార్టీలు కండరాలు మార్చటం మంచినీళ్లు ప్రాయంగా మారిపోయింది… నెల్లూరు జిల్లాలో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019302
Total views : 90262

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.