Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home National పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి

పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి

by Satya
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. జగన్నాథుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది జనం రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. రథయాత్రకు లక్షలాది మంది జనం తరలివచ్చారు. ఈ క్రమంలోనే రథం లాగేందుకు ప్రయత్నిస్తుండగా.. తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు ఒకరు చనిపోగా.. వందల మంది గాయాలపాలయ్యారు. రథయాత్రలో భాగంగా రథాన్ని లాగుతుండగా తోపులాట జరగడంతో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో దాదాపు 400 మందికిపైగా గాయాలపాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అధికారులు, పోలీసులు స్పందించి.. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

53 ఏళ్ల తర్వాత పూరీలో జగన్నీథుని రథయాత్ర రెండు రోజుల పాటు కొనసాగుతోంది. 1971 నుండి, రథయాత్ర కేవలం ఒక రోజు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం రెండు రోజుల పాటు రథయాత్ర నిర్వహించారు. పూరీ జగన్నాథుని రథయాత్రకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈసారి రెండు రోజుల పాటు రథయాత్ర నిర్వహించగా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014721
Total views : 80945

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.