రైల్వేను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. రైల్వేలను మరింత మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నాసిక్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. 400 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో ప్రజలు వెయ్యి కిలోమీటర్ల వరకు సౌకర్యంగా ప్రయాణించేలా చూడడమే తమ ధ్యేయమని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రైల్వేలు పూర్తి స్థాయిలో మారిపోతాయని తెలిపారు. వందే భారత్, నమో భారత్, కవచ్ రైలు రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం వంటి వాటి వల్ల అనేక మార్పులకు దారి తీస్తాయన్నారు.
రైల్వేలను ప్రయివేటీకరించే ప్రశ్నే లేదని, ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. రైల్వే, రక్షణ రెండు భారతదేశానికి రెండు వెన్నెముకలని కొనియాడారు. రైల్వే రాజకీయీకరణ ఆగిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, పనితీరు, భద్రత, సాంకేతికతతో అందరికీ మంచి సేవలను అందించడంపై దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. గత పదేళ్లలో 31 వేల కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్లు వేశామని, ఇది ఫ్రాన్స్ నెట్వర్క్ కంటే ఎక్కువని తెలిపారు. రైల్వే బడ్జెట్ ప్రస్తుతం రూ.2.5 లక్షల కోట్లుగా ఉందన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గురించి మాట్లాడుతూ వాటిని అప్గ్రేడ్ చేసేందుకు రూ.35 కోట్లు కేటాయించామని, సర్వీస్ రూల్స్, ప్రమోషన్లకు సంబంధించిన పలు డిమాండ్లు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- గ్రాండ్గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి…
- ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు ఇంట్లో ఐదారుగురు ఉంటేనే సందడి..సందడిగా ఉంటుంది. అలాంటిది అక్కడ ఏకంగా 181 మంది నివసిస్తున్నారు. అలాగని అది హాస్టల్ కాదు… కుటుంబం..! ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం..! చిన్న కుటుంబం…
- పోలవరం బ్యాక్ వాటర్తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బూర్గంపాడు మండలం ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు .నీటి నిల్వ…
- ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 అమలు పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. విజ్ఞాన్ భవన్లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ రెండు రోజుల సమావేశానికి తెలంగాణ…
- భారత్కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..భారత్-అమెరిక మధ్య మెగా రక్షణ ప్యాకేజీ డీల్ కుదిరింది. భారత సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్లు, ‘M777’ ఆల్ట్రా-లైట్ హోవిట్జర్ ఫిరంగుల సహాయక సేవలు, రక్షణ పరికరాల సరఫరా కోసం సుమారు 428 మిలియన్ డాలర్ల ఒప్పందానికి అమెరికా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 80838