27
తెలంగాణలో బయోటెక్ రంగానికి మరో భారీ పెట్టుబడి రానుంది. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ప్రముఖ బయోఫార్మా సంస్థ యామ్జెన్ అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ సంస్థ అవగాహన ఒప్పందం MoU కుదుర్చుకుంది. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని యామ్జెన్ నిర్ణయించింది. జీనోమ్ వ్యాలీలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా పరిశోధన, ఆవిష్కరణలకు మరింత ఊతం లభించడంతో పాటు.. హైదరాబాద్ బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో మరింత కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.