11
ఆగస్టు చివరి నాటికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి విడత పనులు పూర్తి చేసి నల్లమల సాగర్కు నీటిని విడుదల చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం కలెక్టరేట్లో వెలిగొండ పనుల పురోగతి, నిర్వాసితుల పునరావాసం, ముంపు గ్రామాల తరలింపుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిర్వాసితుల కోసం ప్రకటించిన 900 కోట్ల రూపాయల ప్యాకేజీలో ఇప్పటికే 318 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. అర్హులైన ఏ ఒక్క నిర్వాసితుడికీ అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. సాగు, తాగునీటితో పాటు మార్కాపురాన్ని పారిశ్రామిక, హార్టీకల్చర్ హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.