10
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర కాశీ నగరం వారణాసికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను వర్చువల్గా ప్రారంభించారు. వారానికి మూడు రోజులు.. మంగళవారం, గురువారం, శనివారం ఈ విమానాలు అందుబాటులో ఉంటాయి. దీంతో కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు వ్యాపారం, విద్య, పర్యాటకం కోసం ప్రయాణించే వారికి మరింత సౌలభ్యం కలగనుంది. టైర్-2, టైర్-3 నగరాలను ప్రధాన విమాన కేంద్రాలతో అనుసంధానించడమే లక్ష్యమన్నారు. మరోవైపు నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం ప్రాజెక్ట్ మధ్య సీ-ప్లేన్ ప్రాజెక్టుపై కూడా వ్యూహరచన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.