Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన గొప్ప ప్రభుత్వం…

ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన గొప్ప ప్రభుత్వం…

by Prakash
Kasireddy Narayana Reddy in public governance programme

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేశారని మిగిలిన వాటిని ప్రజాపాలన ద్వారా వినతులను తీసుకొని అర్హులందరికీ వంద రోజుల్లో అమలు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆరో వార్డు సిలార్ పల్లిలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయంగా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన గొప్ప ప్రభుత్వం అని అన్నారు. అనంతరం కౌన్సిలర్ విజయలక్ష్మి ఆమె కుమారుడు సతీష్ సమకూర్చిన అమ్మ అన్నపూర్ణ కార్డులను పంపిణీ చేసి ఆ కార్డు ద్వారా నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. విద్యార్థినీలకు సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచులు బృంగి ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి, చింతల రమణా రెడ్డి, కౌన్సిలర్ ఎజాజ్ శ్రీధర్ రెడ్డి, బాలు నాయక్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: