Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల దాడి…

రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల దాడి…

by Prakash
Attacks by ACB officials

ఇటీవల కాలంలో ప్రైవేట్ నెట్ వర్క్ సంబంధించిన కేబుల్ నెట్వర్క్ వైర్ తెగిపడి దానికి విధ్యుత్ ప్రవహించిగా అది మేనేజర్ కి తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ కేసు విషయం లో కేబుల్ కి సంబంధించిన మేనేజర్ స్థాయి ఉద్యోగి ని బ్యాంకు మేనేజర్ మృతి కి కారణం గనుక మాకేంటి అని సుచాయగా అడిగారు. ఇందులో కానిస్టేబుల్ ప్రసాద్ డబ్బా రైటర్ గా వ్యవహరిస్తూ ఉండడం తో కేబుల్ కు సంబంధించిన మేనేజర్ ను రెండు లక్షలు లంచంగా ఇస్తే మీకు అనుకూలం గా కేసు వ్రాస్తాను అని చెప్పాడు. అంత మొత్తం లో మేము ఇచ్చుకోలేము అని చెప్పగా చివరకు ఇరవై ఐదువేలు కు ఒప్పుకున్నారు. ఈ లంచం సొమ్ము ఎవరికి అని అడుగగా ఎస్సై వెంకట రమణ కు అని చెప్పాడు. ఈ రోజు రాజమండ్రి ఏసీబీ అధికారులను కేబుల్ మేనేజర్ సంప్రదించగా సాయంత్రం వారు ఆధ్వర్యం లో కెమికల్ పూసిన ఐదు వందలు నోట్లు ఇచ్చి స్టేషన్ కి కేబుల్ మేనేజర్ ఉద్యోగిని వెళ్ళమనగా, ఎస్సై వస్తారు అని కానిస్టేబుల్ ప్రసాద్ చెప్పాడు. కొద్దిసేపటికి ఎస్సై వెంకటరమణ స్టేషన్ కు రాగ, కేబుల్ మేనేజర్ రసాయనం పూసిన నోట్ల ను కానిస్టేబుల్ ప్రసాద్ కు ఇవ్వగా కానిస్టేబుల్ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. పధకం ప్రకారం ఏసీబీ అధికారులు దాడి చేసి, రసాయనం ముట్టుకున్నా చేతులను కడిగి నిర్ధారించుకుని కానిస్టేబుల్ ప్రసాద్, ఎస్సై వెంకట రమణ లను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Advertisements

You may also like

Our Visitor

013953
Total views : 78669

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.