Saturday, July 18, 2026
News Navigation
Saturday, July 18, 2026
News Navigation

Breaking

Saturday, July 18, 2026
Home Crime నంద్యాల – కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.

నంద్యాల – కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.

by CVR NEWS

నంద్యాల, కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి నంద్యాల వైపు వస్తున్న కారు తమ్మరాజుపల్లె సమీపానికి చేరుకోగానే టైరు పేలడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సురేష్ రెడ్డి గతంలో నంద్యాల, పాణ్యం పోలీస్ స్టేషన్‌లో కూడా విధులు నిర్వహించారు. అదే కారులో ప్రయాణిస్తున్న ఎస్బీ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్ రెడ్డితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతపురంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పాణ్యం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టైరు పేలడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో నంద్యాల–కర్నూలు జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండటం ప్రయాణికులు, వాహనదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

041212
Total views : 214660

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: