Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Andhra Pradesh విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా

by Satya
విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు. ప్రస్తుతం మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ సీఎండీ‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు విశాఖ ఉక్కు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలి కాలం వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన అతుల్ భట్ పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ 30వరకూ ఉన్నా, ఆయన రెండు నెలల క్రితం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా ఆయనను దీర్ఘకాలిక సెలవుపై పంపినట్లుగా కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు.
అతుల్ భట్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన నేపథ్యంలో అప్పటి నుంచి ఉక్కు డైరెక్టర్ ఏకే బాగ్చీ ఇన్ చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉక్కు సీఎండీ పోస్టునకు నిర్వహించిన ఇంటర్వ్యూలో శక్తిమణి ఎంపికయ్యారు. ఆయన డిసెంబర్ 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పటి వరకూ ఏకే సక్సేనా సీఎండీగా వ్యవహరిస్తారు. మరో పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసే ప్రదిపాదన చేయనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..
    తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం…
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
    ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
  • అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.
    కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
  • నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.
    నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
  • పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
    పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.