Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Andhra Pradesh ఎర్రచందనం పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

ఎర్రచందనం పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

by Satya
red sandalwood

ఎర్రచందనం పెంపకం, ఎగుమతుల పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పరిమితంగా పండే ఎర్రచందనాన్ని సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటన చేశారు. సాగుకు కేంద్రం అనుమతులు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది.కేంద్రం ప్రకటనతో రైతులకు ఎర్రచందనం సాగు చేసే వెసులుబాటు కలిగింది. అలాగే ఎగుమతి చేసుకునేందుకు కూడా ప్రోత్సాహం లభించినట్లయింది. ఈ ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందినవి. వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఏపీలోని శేషాచలం, వెలుగొండల్లో మాత్రమే ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది. ప్రధానంగా, శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

Advertisements

You may also like

Our Visitor

023272
Total views : 141702

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.