Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh నరసరావుపేటలో పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు

నరసరావుపేటలో పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు

by Satya
TDP and YCP

పల్నాడు జిల్లా (Palnadu) నరసరావుపేటలో పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు జరిగాయి. రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నారు వైసీపీ, టీడీపీ ఎంపీ అభ్యర్థులు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించనుంది టీడీపీ అధిష్టానం. ఇప్పటికే నారా చంద్రబాబుతో రెండుసార్లు భేటీ అయ్యారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. టీడీపీ పార్టీలోకి చేరకముందే డాక్టర్లు, వ్యాపారస్తులు, న్యాయవాదులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు ఎంపీ లావు. అయితే నెల్లూరువాసులు నరసరావుపేటలో పోటీ చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ అందరిలోనూ ఉంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నెల్లూరుకి చెందిన.. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయనున్నారు. నరసరావుపేటలో భారీ ఎత్తున అనిల్ కుమార్ యాదవ్ కు ఆహ్వాన సభ నిర్వహించారు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్చార్జిలు. గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీలుగా గెలుపొందారు. వైసీపీ ఎంపీగా గెలిచిన లావు కృష్ణదేవరాలకి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మంచి పట్టు ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా లావు కృష్ణదేవరాయలు గెలిచారు. 2024 ఎన్నికలకు టీడీపీ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: