మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మెతో ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో గత 13 రోజుల నుండి మునిసిపల్ కార్మికుల సమ్మె కారణంగా ప్రధాన వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది, వీధుల్లోని షాపుల ముందు చెత్తాచెదారం పడడంతో షాపు యజమానులకు ఏమి చేయాలో తెలలియక చెత్తను అంటించి వేస్తున్నారు.. దీంతో ప్లాస్టిక్ లాంటి వ్యర్థ పదార్థాలు ఆ చెత్తలో ఉండటం వల్ల ఆ పొగ వాసన ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోంది. దీంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు, ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల సానుకూలత చూపాలని వారు విధుల్లోకి చేరితే పారిశుద్ధ్య పనులు కొనసాగుతాయని, లేనిపక్షంలో చెత్త కుప్పలు మరీ పేరుకుపోయి అనారోగ్యాలకు దారితీస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీధుల్లో పేరుకుపోయిన చెత్త
448
previous post





Total views : 78944