అమరావతి ఈ నెల 27 నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభం కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో యాత్ర షురూ. ఇచ్చాపురం కాకుండా విశాఖలో ముగియనున్న పాదయాత్ర. గతంలో తన యాత్రను విశాఖలోనే ముగించిన చంద్రబాబు. అదే సెంటిమెంట్ తో విశాఖలోనే ముగించాలనుకుంటున్న లోకేశ్. ఈ ఏడాది జనవరిలో యువగళం పాదయాత్ర ప్రారంభం. ప్రజల సమస్యల్ని స్వయంగా అడిగితెలుసుకున్న నారా లోకేశ్. పాదయాత్రలో హామీలిస్తూ ప్రజలకు భరోసా కల్పించిన యువనేత.
Vishakapattanam
ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగబోవు టి20 మ్యాచ్ కి విశాఖపట్నం వైయస్సార్ క్రికెట్ స్టేడియం ముస్తాబయింది. వెయ్యి మందితో స్టేడియం చుట్టూ ప్రహరకాస్తు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, బాంబ్ స్కాడ్ , ఆర్మ్డ్ డ్ రిజర్వ్ టీమ్స్ సంసిద్ధంగా ఉన్నాయి. క్రికెట్ అభిమానులందరూ ఎటువంటి తినుబండారాలు,వాటర్ బాటిల్స్ స్టేడియంలోకి తీసుకురాకూడదని, ట్రాఫిక్ పరంగా అన్ని విధాల డైవర్షన్స్ చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామంటున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు తో మా విశాఖపట్నం కరస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్…
విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోలో స్కూల్కు వెళుతున్న చిన్నారుల్ని లారీ ఢీకొట్టింది. ఆటోలో ఉన్న చిన్నారులు రోడ్డుపై చెల్లచెదురుగా పడిపోయారు. దీంతో బీతావహ వాతావరణం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు బేతానీ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు. ఘటనాస్థలంలో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారులు ప్రమాదానికి గురి కావడంతో స్థానికులు వెంటనే స్పందించారు. చిన్నారులకు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రమాద స్థలంలో రోడ్డుపై చిన్నారులు చెల్లచెదురుగా గాయాలతో పడి ఉండటం అందరిని కలిచి వేసింది. కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఎదుట మావోయిస్టు పప్పులూరు దళ సభ్యులు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో పాడేరు ఎస్పీ కార్యాలయంలో తూహిన్ సిన్హా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వచ్చందంగా లొంగిపోయిన వారిని ప్రదర్శించి వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం పప్పులూరు దళానికి చెందిన సిపిఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యులు కిల్లో త్రినాద్ అలియాస్ రాజేష్… కిల్లో బాబూరావు అలియాస్ సుత్తి వీరు మల్కానగిరి జిల్లా ఈతలంక గ్రామస్థులు కాగా, వీరిద్దరూ పప్పులూరు ఏరియా దళ కమాండర్ పార్వతి ప్రోద్బలంతో 2008 సంవత్సరంలో మిలీషియా సభ్యులుగా చేరి, సంవత్సర కాలంలో మావోయిస్టు పార్టీ పప్పులూరు దళంలో కలిమెల, ఏఒబి ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పులు, మందుపాతర పేలుళ్లు, కరువు దాడుల్లో పాల్గొన్నారు. అదే విధంగా లొంగిపోయిన ముగ్గురు మిలీషియా సభ్యులైన కిల్లో రాజు. వంతల భగత్ రామ్, పాంగి సదునో పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నట్లు ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు. ఇటీవల మావోయిస్టు పార్టీకి ఆదరణ తగ్గిపోవడం, పోలీస్ కాంపులు పెరగడంతో, స్వేచ్ఛగా తిరగలేక ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు కమ్యూనిటీ పోలిసింగ్, ఫ్రెండ్లీ పోలిసింగ్ వంటి కార్యక్రమాల ద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు కల్పిస్తున్న ఉద్యోగాలకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు, నిరుద్యోగ గిరిజన యువతకు వ్యాపార నిమిత్తం బ్యాంక్ రుణాలు అందించే కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీ నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనే నిర్ణయంతో స్వచ్చందంగా లొంగిపోయినట్లు తెలిపారు. ఈ సందర్భముగా ఎస్పీ తూహిన్ సిన్హా మాట్లాడుతూ చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిశోర్, జీ.కే.వీధి సిఐ జి.అశోక్ కుమార్, సీలేరు ఎస్సై జె.రామకృష్ణల సేవలను కొనియాడారు.
విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు మంత్రి సీదిరి అప్పల రాజు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాద ఘటన సందర్బంగా ఓ యూట్యూబర్ అక్కడ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, సదరు యూట్యూబర్పై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. రాత్రి ఫిషింగ్ హార్బర్లో పార్టీ ఏర్పాటు చేసిన యూట్యూబర్. పార్టీలో మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, పరారీలో ఉన్న యూట్యూబర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also..
Read Also..
బ్రేకింగ్ న్యూస్…
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం. దాదాపు 50 కోట్లు పైన అగ్నికి ఆహుతి. కోట్ల విలువ చేసే తమ ఆస్తి కళ్ళముందే బూడిద పాలు అవుతున్న వైనం. విశాఖ పాత నగరంలో అలుముకున్న విషాద ఛాయలు. ఈ ఘటనపై ఆరా తీస్తున్న ఉన్నత స్థాయి అధికారులు. అగ్నిమాపక దళాలు, పోలీస్ ఘటనా స్థలానికి చేరుకుంటున్న వైనం. ప్రమాదంపై ఆరా తీస్తున్న విశాఖ ఉన్నతాధికారులు. జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 40 మెకానిజడ్ బోర్డ్స్ అగ్నికి ఆహుతి అయ్యాయి. మూడు గంటల అగ్నిమాపక సిబ్బంది కృషితో మంటలు అదుపులోనికి వచ్చాయి. ఆస్తి నష్టం కోట్లల్లో ఉంటుందని, తమ కళ్ళముందే అగ్నికి ఆహుతి అయిన బోట్లను చూసి మత్స్యకారులు తీవ్ర మనోవేదనకి గురయ్యారు. ప్రాణ నష్టం లేకుండా మంటలను అదుపులోకి తీసుకు వచ్చామంటున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ రెడ్డి వెల్లడించారు.
విశాఖపట్నం జిల్లా సింహాచలం లో జీవీఎంసీ సిబ్బంది బాధితులకు నష్టపరిహారం ఇవ్వకముందే నిర్మాణాల్ని తొలగిస్తున్నారు. తొలిప్రేవంచ వద్ద నుండి అడవివరం వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది బాధితులకు నష్టపరిహారం టిడియార్లు చెల్లించకపోవడంతో ఆ రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నారు. దీనితో జీవీఎంసీ అధికారులు కు బాధితులకు మధ్య వివాదం చోటుకేసుకుంది. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బాధితుల తరఫున టిడిపి, వైసిపి, మరియు జనసేన నాయకులు అధికారులతో వారించారు. బాధితులకు నష్టపరిహారం, టిడియార్లు అందజేసిన తదుపరి బిఆర్టిఎస్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీస్ యంత్రాంగం నాయకులను అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో జనసేన భీమిలి ఇన్చార్జ్ పంచకర్ల సందీప్, టిడిపి నాయకుడు పాసర్ల ప్రసాదు, 98 వ వార్డు టిడిపి కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహం, తో పాటు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బెహరా భాస్కరరావు ఉన్నారు.
Read Also..
ఏపిఎస్ ఆర్టీసీకి ఆదాయానికి కేటుగాళ్లు భారీగా గండి కొడుతున్నారు. విశాఖలో కలాసీలను సొంత వాహనాల్లో సరుకు రవాణా చేస్తున్నారు. ఇంటర్సిటీ ట్రాన్స్ పోర్ట్ కోసం ప్రైవేటు వ్యక్తుల వాహనాల్లో సరుకును తరలిస్తున్నారు. ప్రైవేట్ వాహనాలపై యధేచ్చగా ఏపీఎస్ఆర్టీసీ బోర్డులు పెట్టుకుని సరుకును తరలిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో సరుకు రవాణా చేస్తున్నా ఆర్టీసీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుండటం గమనార్హం. పబ్లిక్ గా ఇలా జరుగుతుంటే ఆర్టీసీ ఎప్పటికీ లాభాల్లోకి రాదని ఉద్యోగులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా విశాఖ ఆర్టీసీ అధికారులు పట్టించుకోక పోవడంతో ఉద్యోగులు మండిపడుతున్నారు.
విశాఖలో కలాసీల సొంత వాహనాల్లో సరుకు రవాణా చేస్తున్న వైనం. ఇంటర్సిటీ ట్రాన్స్పోర్ట్ కోసం ప్రైవేటు వ్యక్తుల వాహనాల్లో సరుకు తరలింపు. ప్రైవేట్ వాహనంపై యదేచ్చగా ఏపీఎస్ఆర్టీసీ బోర్డులు. ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు. ఇలా అయితే ఆర్టీసీ ఎప్పటికీ లాభాల్లోకొస్తాదని ఉద్యోగులు గుసగుసలు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకోని విశాఖ ఆర్టీసీ ఉన్నతాధికారులు.
శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.




Total views : 223638