145
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండేళ్లుగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, ప్రతి అర్హ ఓటరు వివరాలు సేకరించి ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.