61
దక్షిణ కొరియాలో పెట్టుబడుల వేటకు ఏపీ మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో కొరియా మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ సంస్థలకు వివరించనున్న లోకేష్.. ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో పాటు స్టార్టప్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొననున్నారు. పరిశ్రమలు, ఐటీ, ఆధునిక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.



Total views : 194080