వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో బొత్స వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా,ఈ పోరుకు దూరంగా ఉండాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో బొత్సకు ఎదురులేకుండా పోయింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచినట్టు బొత్సకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవపత్రం అందజేశారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో షేక్ షఫీ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థి కూడా బరిలో దిగగా… ఆయన ఇటీవల తన నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దాంతో బొత్స ఒక్కరే రేసులో మిగిలారు. కాగా, ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత… ఈ తాజా విజయం వైసీపీకి కాస్త ఉపశమనం కలిగించింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ “రణబాలి” సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్…
- సెమీకాన్ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.భారత్ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ హబ్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో గురువారం ‘సెమీకాన్ ఇండియా-2026’ సదస్సును ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు…
- జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామన్నారు. అలాగే యువత కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు…
- 96 ఏళ్ల తర్వాత జిల్లాలో రీ-సర్వే.96 సంవత్సరాల తర్వాత బౌండరీస్ చట్టం ప్రకారం జిల్లాలో రీ-సర్వే చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన భట్టి విక్రమార్క.. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.…
- లండన్లో కన్నులపండువగా గంగా హారతి.బ్రిటన్ రాజధాని లండన్లో థేమ్స్ నది ఒడ్డున నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. చిన్మయ మిషన్ సేవలు ప్రారంభించి 75ఏళ్లు అయిన సందర్భంగా.. చిన్మయ్ మిషన్ యూకే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గంగా నది ఒడ్డున ప్రతిష్ఠాత్మకంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి