ఢిల్లీ(Delhi)లో అమిత్షాతో గంటకు పైగా చంద్రబాబు , పవన్ చర్చలు కొనసాగాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై రెండో దఫా చర్చలు నడిచాయి. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చే చాన్స్ ఉన్నట్లు తెలిసింది. బీజేపీ హై కమాండ్ ఎక్కువ పార్లమెంట్ స్థానాలను కోరుతోంది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్నారు. బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి 5 లేదా 6 ఎంపీ సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.