ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఢిలీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులు, పెద్దలను సీఎం చంద్రబాబు కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు నేడు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. రాత్రి 7గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సైకిల్పై కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..ఈ కార్యక్రమంలో పాల్గొన్న…
- కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు, నియోజకవర్గాల వారిగా పార్టీ బలోపేతం లాంటి అంశాలపై చర్చించారు. పార్లమెంట్ నియెజకవర్గాల వారీగా ప్రత్యేక…
- ఏపీలో వితంతువులకు శుభవార్త..రాష్ట్రంలోని వితంతువులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12వ తేదీ నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన…
- క్వాంటం టెక్నాలజీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..దేశాల భవిష్యత్కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ అత్యంత కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏప్రిల్ 14న ‘క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్’ ప్రారంభోత్సవం అనంతరం, ప్రపంచస్థాయి క్వాంటం వ్యవస్థ దిశగా మరో ముఖ్యమైన అడుగు పడిందన్నారు.దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో…
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 79868