Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana నేడు ధరణి పోర్టల్‌ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

నేడు ధరణి పోర్టల్‌ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

by Satya
Revanth Reddy


సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy):

ధరణి పోర్టల్‌పై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ధరణి కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ధరణిలో సమస్యలపై తాము సిద్ధం చేసిన మధ్యంతర నివేదికను అందించనున్నారు. పోర్టల్‌ పేరు మార్పుతో పాటు అందులో చేయాల్సిన మార్పులను సీఎం రేవంత్‌ రెడ్డికి వివరించనున్నారు కమిటీ సభ్యులు.

నేషనల్ లెవల్ టెక్ ఫెస్ట్…

చిన్న చిన్న మార్పులతో పరిష్కారం అయ్యే వాటిని మధ్యంతర నివేదికలో చేర్చింది ధరణి కమిటీ. గతంలో పట్టా ఉండి ధరణి వచ్చిన తర్వాత ఫారెస్ట్, దేవాదాయశాఖ భూములుగా జాబితాలో ఉన్న వాటికి లైనంత త్వరగా మార్పులు చేర్పులు చేయాలని ధరణి కమిటీ నివేదికలో పేర్కొంది. ధరణి సమస్యలపై పలు శాఖల అధికారులతో పాటు కలెక్టర్లతో పలుదఫాలుగా సమావేశాలు నిర్వహించింది ధరణి కమిటీ.

హుస్నాబాద్ బస్ స్టాండ్ ను సందర్శించిన మంత్రి పొన్నం…

ధరణి రిజిస్ట్రేషన్‌లల్లో భారీగా లోపాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ధరణిలో ఉన్న సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలు తీసుకుంటే బాగుంటుందనే ఫీడ్ బ్యాక్ తీసుకుంది. ఇలా ధరణి సమస్యలపై దృష్టి పెట్టిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ నివేదిక ఆధారంగా ధరణిలో ఎలాంటి మాడ్యూల్స్ చేంజ్ చేస్తారనేది ఆసక్తిగా మారింది.

Follow us on : Facebook, Instagram & YouTube.


సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.
సీఎం రేవంత్‌రెడ్డిని MCHRD బోధి పెవిలియన్‌లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ …
తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు …
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం …

Advertisements

You may also like

Our Visitor

039132
Total views : 194382

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: