Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh టీడీపీలో కలకలం..!

టీడీపీలో కలకలం..!

by Satya
TDP

ఏలూరు జిల్లా ఉండి టీడీపీలో కలకలం రేగింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ రామరాజుకే కేటాయిస్తూ తొలి జాబితా విడుదల చేశారు. దీంతో ఈ స్థానంపై ఆశపెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉండి నుంచి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున శివరామరాజు గెలుపొందారు. అయితే 2019లో రామరాజుకు ఆ స్థానం కేటాయించడంతో వైసీపీపై అభ్యర్థిపై ఆయన గెలుపొందారు.

ప్రధాన మోదీ విశాఖ పర్యటన రద్దు..!

ఈ సారి ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని శివ భావించారు. కానీ రెండోసారి కూడా రామరాజుకే చంద్రబాబు అవకాశం కల్పించడంతో శివరామరాజు మనస్థాపం చెందారు. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ సారైనా గెలవాలనే లక్ష్యంగా ఆ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన వర్గ విభేదాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.
కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ …
అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.
అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై …
శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.
శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: