Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సమావేశం…

వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సమావేశం…

by Prakash
A spirited meeting of YSRCP public representatives

ప్రకాశం జిల్లా మార్కాపురం లోని సెవెన్ హిల్స్ కళ్యాణ మండపంలో మార్కాపురం సమన్వయకర్త గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మండలంలోని వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధుల తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ చైర్మన్ & జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జంకె వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గంలోని కొంతమంది వైసిపి ముఖ్య నేతలు వెన్న హనుమారెడ్డి, గుంటక సుబ్బారెడ్డి, డాక్టర్, కనకదుర్గ గైరాజరయ్యారు. ఈ సమావేశంలో మండలంలోని జడ్పిటిసి, ఎంపిటిసిలు, సర్పంచులు, మండల, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఎంపీపీ పదవికి రాజీనామా చేసిన ఎంపీపీ భర్త అరుణ చెంచిరెడ్డి ఆవేదనతో మాట్లాడుతూ ఎన్నో నెలల నుండి తమ పదవికి రాజీనామా చేయాలని మమ్మళ్ళి ఇబ్బంది పెట్టడం జరిగిందని నియోజకవర్గ నూతన సమన్వయకర్త అన్నా రాంబాబు మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పడంతో అతని మీద గౌరవంతో పదవికి రాజీనామా చేసామని అన్న మాటలు సమావేశంలో హాట్ టాపిక్ అయ్యాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: