సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామంలో ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద PSO గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు వారీగా విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చే సమయంలో 9 mm pistol తో తన కుటుంబ సభ్యులైన భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీ లను pistol తో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Crime
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి కస్తూరిబా గురుకుల పాఠశాల ఆరవ తరగతి విద్యార్థిని రక్తం కక్కుకుని మృతి చెందిన ఘటన శుక్రవారం మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో వెలుగు చూసింది. పలమనేరు మండలం, కొలమాసిన పల్లి గ్రామం, పల్నాడు కు చెందిన దంపతులు చందు సుజాత ల కుమార్తె స్వాతి(13) మదనపల్లి నియోజకవర్గంలోని, నిమ్మనపల్లి ముస్టురు కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో స్వాతి ఆరవ తరగతి చదువుతోంది. తీవ్ర ఆస్పస్థతకు గురైన బాలికను గుర్తించి స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం చేశారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తన బిడ్డను స్వగ్రామానికి తరలిస్తూ మార్గమధ్యంలోని పుంగనూరు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయడంతో రాత్రి 11.30 వచ్చి ఆస్పత్రి అత్యవసర విభాగంలో చేర్పించారు. బ్లడ్ వామిట్స్ ఇకమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వాతి చనిపోయింది.
Read Also..
ఏలూరు శివారు జాతీయ రహదారిపై దారిపై దోపిడీలకు పాల్పడుతున్న అంతర రాష్ట్ర దొంగలేనా 5 గురు యువకులు, ఇద్దరు మైనర్లను పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నిందితులను మీడియా ముందు డిఎస్పి అశోక్ కుమార్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి నిందితులు అనేక దారి దోపిడీలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 2 ఆటోలు, 2 బైక్ లు, 2200 నగదు రికవరీ చేసినట్లు వెల్లడించారు. రెండు రోజుల క్రితం కలపర్రు టోల్ ప్లాజా వద్ద రాత్రి సమయంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీ డ్రైవర్ను కత్తితో బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు..
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం చేసాడు. కోడూరు మండలం వి.కొత్తపాలెం లో కౌలు రైతు బాదర్ల సూర్య ప్రభాకరరావు ఆత్మహత్యాయత్నం చేసాడు. 10 ఎకరాల పొలం కౌలుకు వేసిన ప్రభాకరరావు తుఫాను వలన పంట మొత్తం నేలకొరిగి మొలకలు వచ్చాయని ఆవేదనతో పురుగుల మందు తాగి ప్రభాకరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకరరావుని తెలుగుదేశం పార్టీ నేతలు పరామర్శించారు. 24 గంటలు అబ్సర్వేషన్లో ఉండాలని వైద్యులు చెప్పారు. ప్రభాకరరావు కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని రమణయ్య కూల్ డ్రింక్స్ దగ్గర దారుణ హత్య జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న వెస్ట్ ఏసీపీ హనుమంతరావు మాట్లాడుతూ వాసు అలియాస్ యేసు అనే అతను క్యాటరింగ్ కాంట్రాక్టర్లు చేసుకుంటూ ఉంటాడు. బ్యాంకు అరుగు మీద టీ తాగుతున్న సమయంలో గతంలో చాలాకాలం నుండి గణేష్ అనే అతను యేసు దగ్గర పని చేస్తుంటాడు. గణేష్ 15 వేల రూపాయలు అప్పు తీసుకుని తిరిగి అసలు డబ్బులు చెల్లించి వడ్డీ నిమిత్తం ఐదు వేల రూపాయలు ఇవ్వాలన్నాడు. వడ్డీ నిమిత్తం గతకాలం కొంతకాలం నుంచి వీళ్ళిద్దరికీ గొడవ జరిగి మాట మాట పెరిగి సంచిలో ఉన్న కత్తితో మెడ మీద నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామ శివారులో గల చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద గంజాయి అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గురజాల సబ్ ఇన్స్పెక్టర్ జయరామ్. ఈ దాడుల్లో మూడు కిలోల గంజాయిని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, గురజాల మెజిస్ట్రేట్ ముందు నిందితుడును హాజరుపరిచారు. గంజాయి తయారు చేయడం , అమ్మడం నేరమని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గురజాల సెబ్ si జయరామ్ తెలిపారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో సంకురాత్రి వెంకట కోటయ్య తండ్రి జానయ్య (42) అను రైతు గత నాలుగైదు సంవత్సరాలుగా, కౌలుకు పొలం తీసుకుని సాగు చేస్తున్నాడు. పంటలు సరిగా లేక ఒక సంవత్సరం వర్షాలు ఎక్కువ అయ్యి, రెండవ సంవత్సరం నీళ్లు సరిగా లేక పంటలు సరిగా పండక మనస్తాపంతో పొలంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు ముగ్గురు ఆడ పిల్లలు, ఈ సంవత్సరం ఏడు ఎకరాల పొలమును కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పంట నష్టం కారణంగా అదే పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని కరాచీ బేకరీలో పేలుడు సంభవించింది. బేకరీలోని సిలిండర్ పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బేకరీలోని పరిస్థితి దారుణంగా తయారయింది. పేలుడు శబ్దానికి చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధి, గగన్ పహాడ్లోని కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన పేలుడుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్కు చెందినవారు ఉన్నట్లుగా సీఎంకు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఎనిమిది మందిని కంచన్బాగ్ డీఆర్డీవో ఆసుపత్రికి తరలించినట్లు వారు ముఖ్యమంత్రికి చెప్పారు. కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన పేలుడు ధాటికి పదిహేను మంది కార్మికులు గాయపడ్డారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పేలుడు ఘటనపై పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో ఉన్న ఇండస్ హాస్పిటల్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండు, మూడో ఫ్లోర్ నుంచి వచ్చిన పొగ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఫైర్, పోలీస్ మరియు ఆసుపత్రి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పేషెంట్లని బయటకు పంపిన నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు భారీ క్రేన్లతో అందించిన సహాయ సహకారాలు వల్ల పెను ప్రమాదం తప్పింది.
శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ వద్ద భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. పోలీసుల తనిఖీల్లో భాగంగా పెద్ద మొత్తంలో కంటైనర్ ద్వారా అనంతపురం వైపు నుండి జాతీయ రహదారిపై బెంగళూరుకు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని పోలీసులు ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో కంటైనర్ లో బెంగళూరుకు తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోడికొండ చెక్ పోస్ట్ మీదుగా బెంగళూరు వెళ్తున్న కంటైనర్ ని ఆపి చెక్ చేయగా గంజాయి బయటపడింది. గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతోనే పోలీసుల దాడులు గంజాయి విలువ భారీ మొత్తంలో ఉన్నట్లు సమాచారం.