లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆరుగురు సభ్యులతో కూడిన నూతన కమిటీని నియమించింది. బోనాలు, దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణ కోసం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా రంగ రమేష్ గౌడ్, ఎ.మాణిక్ ప్రభు గౌడ్, పోసాని విజయ్ కుమార్, సి.హెచ్.వెంకటేష్, బంగ్లా రాజు యాదవ్, కె.రవిరాజులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లాల్ దర్వాజా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ యేడు బోనాలు, విజయదశమి ఉత్సవాల వరకు ఈ కమిటీ కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా అందరిని కలుపుకుని ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి భారీ సన్నహాలు చేస్తున్నామన్నారు. ఈ నేపధ్యంలోనే శుక్రవారం ఆలయ శిఖర పూజతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, ఆదివారం శాలిబండ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి భారీ ఊరేగింపుగా అమ్మవారి ఘటాన్ని తీసుకు వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగిందన్నారు.
లాల్ దర్వాజా ఆలయానికి ఆరుగురు సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు.
79
previous post