Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra PradeshKadapa జగన్ పోతేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి..

జగన్ పోతేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి..

by Rama
Rajesh reddy

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న విడుదల చేయకపోవడం దారుణమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చదిపిరాళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. జమ్మలమడుగు లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని కడప ఉక్కు పేరుతో, గండికోటలో ఫైవ్ స్టార్ హోటల్ పేరుతో భూములను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గాలివాటంగా వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గాలి మాటలు మానుకోవాలని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ చేయకపోగా తన సొంత జిల్లా కడపకు కూడా ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. జగన్ పోతేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా రాజేష్ తెలిపారు. వచ్చే ఎన్నికలలో మీరు ఏ పార్టీలో ఉంటారని విలేకరులు ప్రశ్నించగా… ఇప్పుడు ఏ పార్టీ తరపున ప్రెస్ మీట్ నిర్వహించామో అదే పార్టీ నుంచి పోటీ చేస్తామని తెలిపారు. జమ్మలమడుగు బరిలో వైయస్ కుటుంబ సభ్యులు ఉండాలని తాము కోరుకుంటున్నామని ఆ ఎన్నికలలో వారిని ఓడించి తీరుతామని ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి మీడియాకు తెలిపారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: