తెలంగాణలో నేటి నుండి అసెంబ్లీ , శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన సమస్యలపై ఎజెండాను అధికార పక్షం సిద్దం చేసుకుంది. విపక్షాలు కూడా తమ అస్త్ర శస్త్రాలతో రెడీ అయ్యారు. ఈ సమావేశాలకు కేసీఆర్..ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన మార్పుపై పట్టుబట్టేందుకు బీఆర్ఎస్ వర్గాలు సిద్దమైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమంటూ ఆ పార్టీ అగ్రనేతలు తెలంగాణ ఎమ్మెల్యేలకు సూచించారు. అధికార పార్టీ హామీలైన ఆరుగ్యారెంటీల అమలును విమర్శనాస్త్రంగా సంధించనున్నది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అవసరమైన వ్యూహంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. విపక్షాలను తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అంతా రెడీ అయ్యింది. ముందస్తు సమావేశం నిర్వహించి వ్యూహరచన చేసుకుంది. ప్రతిపక్షాలు గుక్కతిప్పుకోకుండా సమాధానాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. సభ సజావుగా సాగడానికి అవసరమైన యంత్రాంగాన్ని అంతా సమాయత్తం చేసింది. అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తుకు ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడే విపక్షాల వ్యూహాలను చిత్తు చేసే దిశగా పార్టీ యాంత్రాంగాన్ని సైతం సిద్ధం చేసుకుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్పై వ్యాఖ్యల వెనుక ఫామ్హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి