Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలు..

పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలు..

by Prakash
Pantam Nanaji

కాకినాడ రూరల్ టిడిపి కో కో ఆర్డినేటర్ కటకంసెట్టి వెంకట ప్రభాకర్ (బాబీ) ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన పంచగా శ్రవణం కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి రూరల్ శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్ఛారణ ల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి నాయకులకు కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పంతం నానాజీ మాట్లాడుతూ ఈ ఉగాది నుండి రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి తో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబీ) మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం లో పంతం నానాజీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని, రాష్ట్రం లో కూటమి విజయంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, దేశం లో ప్రధానిగా నరేంద్ర మోడీ విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జన సేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019358
Total views : 90539

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.