Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Latest News క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించిన మల్లారెడ్డి…

క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించిన మల్లారెడ్డి…

by Rama
malla reddy, Mallareddy started cath lab

మేడ్చల్ జిల్లా సూరారం మల్లారెడ్డి హెల్త్ సిటి ఆధ్వర్యంలో మల్లా రెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించిన మేడ్చల్ శాశన సభ్యులు చామకూర మల్లారెడ్డి ‌తో పాటు ముఖ్య అతిధిగా పాల్గొన్న అర్జునా అవార్డు గ్రహీత, జాతీయ ఒలింపిక్ ఘాటర్ ఈషా సింగ్ తదితరులు పాల్గొన్నారు. మల్లా రెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, సూరారం లో తన అత్యాధునిక క్యాథెటరైజేషన్ లాబొరేటరీ (క్యాథ్ ల్యాబ్) ఇది సంస్థ యొక్క అధునాతన వైద్య సదుపాయాలతో ప్రారంభించారు.

అత్యాధునిక సాంకేతికతను కలిగిన కొత్త క్యాథ్ ల్యాబ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసమానమైనది. అనేక అధునాతన సాంకేతికతలను నిర్వహించడానికి అమర్చబడిన ఈ సదుపాయం రోగులకు 3D రొటేషనల్ యాంజియోగ్రఫీ ఫర్ పెర్క్యుటేనియస్ ఇంటర్వెన్షన్స్ (3D RA), ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ (OCT) , డైనమిక్ కరోనరీ రోడ్‌మ్యాప్ (DCR), 3D వెసెల్ పునర్నిర్మాణం, స్మార్ట్ వంటి సమగ్ర సేవలకు యాక్సెస్‌ను అందిస్తుంది. CT యాంజియో మరియు మరెన్నోఇతర పరీక్ష లకు వినియోగపడుతుంది. మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో నాణ్యమైన పేషెంట్‌ కేర్‌ డెలివరీలో ఎలాంటి తిరుగులేదని ప్రతిజ్ఞ చేసారు. ఈ అత్యాధునిక క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రవేశపెట్టడమే ఇందుకు నిదర్శనం. ఆరోగ్య సంరక్షణలో శ్రేష్ఠతకు అచంచలమైన నిబద్ధత మరియు అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన పరికరాల సహాయంతో రోగులకు సత్వర మరియు ఖచ్చితమైన సంరక్షణ అందేలా వీరు కృషిచేస్తున్నారు.

ఈ కార్యక్రమం లో ఆసుపత్రి చైర్మన్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జాతీయ షూటర్ ఈషా సింగ్, వైస్ చైర్మన్ డా” భద్రారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డా” ప్రీతీ రెడ్డి, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Read Also…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: